మానసిక ఆరోగ్యం సమాజ శ్రేయస్సుకు పునాది
పత్రికా ప్రకటన ఏఐఎంఎస్ఆర్, చిత్తూరు తేదీ: 09 అక్టోబర్ 2025 మానసిక ఆరోగ్యం సమాజ శ్రేయస్సుకు పునాది – ఆపోలో వర్శిటీ వీసీ డా. హెచ్. వినోద్ భట్ _ ఎఐఎంఎస్ఆర్లో ఘనంగా మానసిక ఆరోగ్య వారోత్సవ వేడుకలు చిత్తూరు, అక్టోబర్ 9: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (AIMSR)లో సైకియాట్రి విభాగం ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు గురువారం ఘనంగా ముగిశాయి. “కాటాస్ట్రోఫీలు, అత్యవసర పరిస్థితుల్లో మానసిక ఆరోగ్య సేవల ప్రాముఖ్యత” అనే థీమ్తో జరిగిన ఈ కార్యక్రమాలకు ది అపోలో యూనివర్శిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ హెచ్. వినోద్ భట్, AIMSR డీన్ డాక్టర్ ఆల్ఫ్రెడ్ జె. ఆగస్టైన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైస్చాన్సలర్ డాక్టర్ హెచ్. వినోద్ భట్ మాట్లాడుతూ, “మానసిక అనారోగ్యం అనేది ఎంతో క్లిష్టమైనది. బాధితుల దగ్గర వారు కూడా దాన్ని గుర్తించడంలో విఫలమవుతుంటారు. మానసిక ఆరోగ్యం ఒక వ్యక్తి సమస్య మాత్రమే కాదు, అది కుటుంబం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రతి ఒక్కరూ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక స్థైర్యాన్ని కాపాడుకోవాలి. వైద్య రంగంలో, ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో మానసిక ఆరోగ్య సేవలు అందించగల నిపుణులను సిద్ధం చేయడం సమాజానికి అత్యవసరం” అని అన్నారు. ఈ సందర్భంగా పోస్టర్ ప్రదర్శనలు, వ్యాసరచన, నినాద రచన, డిబేట్, స్కిట్ ప్రదర్శనలు వంటి పోటీలు నిర్వహించారు. విద్యార్థులు తమ సృజనాత్మకతను ప్రతిభను ప్రదర్శించారు. విజేతలకు ముఖ్య అతిథులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రంలో అసోసియేట్ డీన్ డాక్టర్ రమ్యా రామకృష్ణన్, సైకియాట్రి విభాగం ప్రొఫెసర్ డాక్టర్ దినేష్. పి, సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ భాస్కర్ నాయుడు, అధ్యాపకులు, స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్, మెడికల్, పారా మెడికల్ అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ———————– డైరెక్టరేట్ ఆఫ్ ప్రెస్ & పబ్లికేషన్స్ ది అపోలో యూనిర్శిటీ & AIMSR చిత్తూరు.